క్రైమ్/లీగల్

సయ్యద్ గిలానీకి 14 లక్షల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: అక్రమంగా విదేశీ కరెన్సీని తన వద్ద ఉంచుకున్న అతివాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ. 14.40 లక్షల జరిమానా విధించింది. 17 ఏళ్ల క్రితం అక్రమంగా పది వేల అమెరికన్ డాలర్లను తన వద్ద ఉంచుకున్న గిలానీకి విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన నిరోధక చట్టం కింద ఈ జరిమానా విధించినట్టు అధికారులు తెలిపారు. ఫెమా చట్టం కింద మార్చి 20వ తేదీన జారీ చేసిన ఆదేశాల ప్రకారం రూ. 6.90 లక్షల విలువ గల ఆ అమెరికన్ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. శ్రీనగర్‌లోని హైదర్‌పుర ప్రాంతంలో గల గిలానీ నివాసంలో ఆదాయపు పన్ను అధికారులు 2002లో ఈ విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.