క్రైమ్/లీగల్

కూతురుపై మారుతండ్రి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, మార్చి 25: కూతురుపై మారు తండ్రి పలు మార్లు అత్యాచారం చేసిన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయురాలు మైనర్ బాలికను ప్రశ్నిస్తే జరిగిన విషయం తెలిపింది. గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కోమరయ్య కథనం ప్రకారం... రాందేవ్‌గూడకు చెందిన షానాజ్ గత కొన్ని సంవత్సరాల క్రితం నూర్ హైమాద్‌తో పెంళ్లి జరిగింది. ఈ క్రమంలో వారికి ఇద్దరు కూతుర్లు. కొంత కాలానికి నూర్, షానాజ్‌ను విడచిపెట్టి వెళ్లాడు. అయ్యాబ్‌ఖాన్ (42)తో షానాజ్‌కు గత కొన్ని సంవత్సరాల క్రితం రెండవ వివాహాం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి మరో ఇద్దరు మగ సంతానం కలిగింది. గత రెండు సంవత్సరాల క్రితం షానాజ్ పని నిమిత్తం దూబాయ్‌కి వెళ్లింది. నెల రోజులుగా మారు తండ్రి అయ్యాబ్‌ఖాన్ పెద్ద కూతురు (13)పై పలు మార్లు ఆత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. పాఠశాలలో నిరసంగా కూర్చున్న ఆ విద్యార్థీనీని ఉపాధ్యాయురాలు ప్రశ్నించగా ఆసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రశ్నించగా జరిగిన విషయం తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.