క్రైమ్/లీగల్

రైలు కిందపడి డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, మార్చి 23: రైలు కిందపడి బుర్రి ధనలక్ష్మి(20) అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం తూనికిపాడు గ్రామానికి చెందిన ధనలక్ష్మి మధిరలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. . పరీక్షలు రాసేందుకు శుక్రవారం ఇంటి నుండి మధిర వచ్చిన ధనలక్ష్మి రైల్వేగేటు వద్ద విజయవాడ వెళ్ళే పుష్ అండ్ పుల్ ప్యాసింజర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం రైలు చక్రాల మధ్య ఇరుక్కుపోవడంతో రైలును గేటుపై నిలిపి మృతదేహన్ని బయటకు తీశారు. పరీక్షలు బాగా రాయడం లేదనే మనస్థాపంతో తమ కుమారై ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు తల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్ కానిస్టెబుల్ తుమ్మల బాలస్వామి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని మధిర ప్రభుత్వ హాస్పిటల్‌కు తరిలించారు.