క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మార్చి 28: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట్ జిల్లా మాసాయిపేట గ్రామానికి చెందిన రాజు అతని బావమరిది యాదగిరి(22)తో కలిసి గురువారం ఉదయం బైక్‌పై అయోధ్య క్రాస్ రోడ్డు వస్తుండగా మేడ్చల్ పట్టణ ప్రధాన కూడళి అంబేద్కర్ విగ్రహం వద్ద అతి వేగంగా లారీ వచ్చి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో యాదగిరికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రున్ని హుటహుటిన ఆసుపత్రికి తరలించగా చిక్సిత పొందుతూ మృతిచెందాడు. కేసు నుమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపారు.

ఎక్సైజ్ దాడులు.. ఇద్దరిపై కేసు నమోదు
కొడంగల్,మార్చి 28: మండల పరిధిలోని బోనమ్మ తాండా, భీమిలి తాండాలపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సమావేశంలో సీఐ శివయ్య మాట్లాడుతూ... జిల్లా అధికారుల అదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు.
దాడుల్లో 8 లీటర్ల నాటు సారాను పట్టుకున్నట్లు తెలిపారు. నాటుసారా తయారికి పాల్పడిన ఇద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎక్సైజ్ సిబ్బందితో పాటు కర్ణాటక రాష , ఎక్సైజ్ సిబ్బంది పాల్గొనట్టు తెలిపారు.