క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, మార్చి 24: అనుమానాస్పద స్థితిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. స్టేషన్ సీఐ జగన్మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం న్యూ రాజరాజేశ్వరిపేట ఫార్చ్యూన్ హై అపార్ట్‌మెంట్ 305 ఫ్లాట్‌లో పారెం నాగమణి (60) నివాసముంటుంది. ఈమెకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు కల్యాణ్ దేవినగర్‌లో, రెండో కొడుకు నరసింహారెడ్డి లోటస్ వెంచర్‌లో నివాసముంటున్నాడు. కూతురు గుంటూరులో ఉంటుంది. సంవత్సరంలో ఒక్కొక్కరి దగ్గర కొంతకాలం ఉంటూ వస్తున్న నాగమణికి నరసింహారెడ్డి ఆరు నెలల క్రితం రాజరాజేశ్వరిపేటలో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు. అప్పటి నుండి ఈమె ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లోనే ఉంటోంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో బయటకు వెళ్లిన నాగమణి శనివారం ఉదయానికల్లా హాలులో శవమై పడి ఉంది. ఈమె ధరించి వున్న లక్ష రూపాయల విలువైన నగలు అపహరణకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పెద్ద కొడుకు కల్యాణ్ ఫిర్యాదు మేరకు నగల కోసం జరిగిన హత్యగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.