క్రైమ్/లీగల్

మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట, ఏప్రిల్ 4: మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శిరషా రాఘవేందర్ తెలిపారు. గురువారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 2న నర్సాపూర్ తండాకు చెందిన ఝుంకీబాయితో హరియాతోపాటు మరికొందరు గొడవపడ్డాడు. ఆవేశంతో ఝుంకీబాయిని గొడ్డలితో నరికి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది. నిందితులు హరియ, రుక్కిబాయి, శంకర్‌ను అరెస్టు చేయగా, సుభాష్ పరారో ఉన్నాడు. సమావేశంలో సీఐ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ దొంగల అరెస్టు
తాండూరు, ఏప్రిల్ 4: కొంత కాలంగా పట్టణ పరిసర ప్రాంతాలలో కలకలం రేపిన సెల్‌ఫోన్ చోరీచేసే వ్యక్తులు దొరికారు. ఇళ్లలో, హాల్‌లో సెల్‌ఫోన్‌లు చార్జింగ్‌కు పెట్టిన వాటిని చోరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు గురువారం వలపన్ని పట్టుకున్నారు. ఈనెల 2న సాయిపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యాపారి మహబూబ్ మియా ఇంటిలో చోరబడి రెండు సెల్‌ఫోన్‌లు అపహరించారు. నిందితులను పట్టణ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని సీఐ ఎస్.రవి కుమార్ వెల్లడించారు.