క్రైమ్/లీగల్

రూ.3.5 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టబడుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు దాదాపురూ 9.45 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ జంటనగరాల్లో ఎన్నికల సందర్భంగా తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. బంజారాహిల్స్ పోలీసులు గురువారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేయడంతో రూ. 3.50 కోట్ల రూపాయలు పట్టబడ్డాయని తెలిపారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో చంద్రకాంత్ అనే వ్యక్తి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అమీర్‌పేట్‌లో రెండు నివాసాల్లో పోలీసులు దాడులు చేశారని అక్కడ 2,50 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీసుల సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ అధికారులకు అప్పచెప్పామని, దీనిపై విచారణ చేస్తున్నామన్నారు.