క్రైమ్/లీగల్

ప్రేమించి పెళ్లాడి..కట్నం కోసం వేధించి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసముద్రం, ఏప్రిల్ 5: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలో గురువారం రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య అనూష (22)ను ఇంట్లోని రేకుల పైకప్పు పైపునకు ఉరేసి చంపినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మృతురాలి తండ్రి సామేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ కథనం ప్రకారం.. నెల్లికుదురు మండలం చిన్న నాగారం గ్రామానికి చెందిన శ్రీకాంత్, అనూష వేర్వేరు కులాలకు చెందినవారు. 2015లో ప్రేమించి వివాహం చేసుకొని ఇనుగుర్తిలో కాపురం పెట్టారు. వివాహం జరిగినప్పటి నుంచి అనూషను బంధువులకు దూరం చేయడంతో పాటు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ తల్లి రేణుక, మేనమామ కొండయ్య మాటలు విని భార్యను మరింతగా వేధించడంతో పాటు ఆమెను గురువారం రాత్రి ఇంట్లోని పైకప్పు పైపుకు ఉరేసి చంపాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.