క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, మార్చి 25: అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్టర్రహదారిపై మండలంలోని చక్రాయపాలెం వద్ద రోడ్డు డివైడర్‌కు కారు ఢీకొని కారు బోల్తాపడిన ఘటనలో ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన అద్దంకి విజయభాస్కర్(17) మృతి చెందగా, భీమవరం గ్రామానికి చెందిన నల్లమోతు రామాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు ప్రమాదం ఘటన సమాచారం తెలుసుకున్న 108 వాహనం వారు, వారిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు, క్షతగాత్రులిద్దరూ ఆదివారం ఉదయం ముండ్లమూరు మండలం నుండి అద్దంకి మీదగా బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా చక్రాయపాలెం వద్ద ఈ ఘటన జరిగింది. అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.