క్రైమ్/లీగల్

కొంపముంచిన ఈత..సెల్ఫీ సరదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, ఏప్రిల్ 7: ఈత సరదా ఓ ఇంట్లో తండ్రి, కొడుకులను జల సమాధికి కారణమైన ఉదంతం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. సంఘటన వివరాలు సోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన కప్పల లింగయ్య (40), అతని కుమారు శ్రీమణికాంత్ (11) వేములపల్లి మండల కేంద్రం మీదుగా ప్రయాణిస్తూ మధ్యలో సాగర్ ఎడమ కాల్వలో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యారు. వీరు దామరచర్ల మండల కేంద్రంలో జరిగిన గురుకుల పరీక్ష కోసం ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తూ మార్గమధ్యలో ఉన్న సాగర్ ఎడమ కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లగా శ్రీమణికాంత్ ప్రమాదవశాత్తు కాల్వలో కొట్టుకుపోగా కుమారుడిని రక్షించే యత్నంలో తండ్రి లింగయ్య సైతం గల్లంతయ్యాడు. కాగా, అంతకు ముందు మణికాంత్ కాల్వ కట్టపై ఫొటో దిగి తల్లికి ఫొటోను వాట్సప్‌లో పంపారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన తండ్రీ కొడుకుల కోసం ఎడమ కాల్వలో గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. లింగయ్య భార్య సుభాషిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుధీర్‌కుమార్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
కప్పల లింగయ్య, శ్రీమణికాంత్ (ఫైల్‌ఫొటోలు)