క్రైమ్/లీగల్

బావిలో పడి ఐదుగురు బాలికల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్దకల్, ఏప్రిల్ 8: జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తున బావిలోపడి ఐదుగు రు బాలికలు మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి ఎల్లప్పకు నలుగురు కుమార్తెలు సంతానం కాగా వీరిలో యమున (12), చిన్నారి (10), బుజ్జి (8) బావిలోపడి మృతి చెందారు. కుమ్మరి కృష్ణకు కుమారుడు, కుమార్తె సంతానం కాగా చిన్నారి (9) మృతి చెందింది. కుర్వ చిన్న వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం కాగా వీరిలో కవిత (12) మృతి చెందింది. కవిత గురుకుల పాఠశాలలో చదువుకుంటుంది. ఇటీవల పండుగ సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మల్దకల్ మండల కేంద్రంలోని నిర్వహిస్తున్న మహిళా ఆశీర్వాద సభలో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీచైర్మన్ బండారి భాస్కర్‌తో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు రెండు నిమిషాలు వౌనం పాటించారు.
చిత్రం.. బావిలోపడి మృతి చెందిన బాలికలు