క్రైమ్/లీగల్

పాతకాల్వ వద్ద బోల్తాపడ్డ తమిళనాడు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 25: తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ వద్ద పూతలపట్టు-నాయుడు జాతీయ రహదారిలో ఆదివారం ఉదయం 6గంటల సమయంలో తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి తిరుపతికి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొని 20 అడుగుల గుంతలోకి బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్ అరుణాచలంతోపాటు బస్సులో ప్రయాణిస్తున్న సుందరరాజు అక్కడికక్కడే మరిణించారు. సేలం నుంచి తిరుపతికి వస్తున్న బస్సులో డ్రైవర్, కండక్టర్‌తోపాటు 20 మంది ప్రయాణికులు ఉన్నారు. పాతకాల్వ వద్ద బస్సు అదపుతప్పి కల్వర్టును ఢీకొని 20 అడుగుల గుంతలో బోల్తాపడింది. దీంతో ఇద్దరు మృతి చెందగా మరో 18 మంది గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే తిరుపతి రుయాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ముందు వెళుతున్న బస్సును అధిగమించే ప్రయత్నంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మార్‌పల్లి డీఎస్పీ కనకరాజు పరిశీలించారు.