క్రైమ్/లీగల్

విజయనగరంలో రియల్టర్ కాల్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 25: ప్రశాంతమైన విజయనగరంలో ఒక్కసారిగా తుపాకీ కాల్పులు చోటుచేసుకోవడం సంచలనమైంది. శనివారం అర్ధరాత్రి రియాల్టర్ నమ్మి అప్పలరాజుపై మరో రియల్టర్ బొత్స మోహన్ కాల్పులు జరిపాడు. వరుసగా ఆరు రౌండ్లు కాల్చడంతో అప్పలరాజు కిందపడిపోయాడు. ఇక్కడి ఎల్‌ఐసీ భవన్‌కు సమీపంలోని రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద ఈ సంఘటన జరిగింది. అర్ధరాత్రి వేళ్ళ తుపాకీ శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వారు పరుగున అక్కడకు వచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బొత్స మోహన్‌కు, అప్పలరాజుకు కొనే్నళ్ళుగా ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, అప్పలరాజుది విశాఖ జిల్లా, భీమిలి మండలంలోని సంగివలస గ్రామం. మోహన్‌ది విశాఖలోని పోతినమల్లపాలెం.