క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ కల్నల్ కుమార్తెల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఏప్రిల్ 14: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ కల్నల్ వినీత్ అగర్వాల్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రత్తిపాడు ఎస్సై బాలాజీ అందించిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాయబరేలీకి చెందిన కల్నల్ వినీత్ అగర్వాల్‌కు కోల్‌కత్తాకు బదిలీ కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు కారులో బయలుదేరారు. ఈ కారు అతివేగంగా వెళుతూ ధర్మవరం జాతీయ రహదారిపై ఆగివున్న కంటైనర్‌ను ఢీకొట్టింది. కారు వెనుక సీట్లో ఎడమవైపు కూర్చున్న కల్నల్ కుమార్తెలు రాధికా అగర్వాల్ (16), రితికా అగర్వాల్ (14) అక్కడికక్కడే మృతిచెందారు. వినీత్ అగర్వాల్, ఆయన సతీమణి సుభాయ్ అగర్వాల్‌కు స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి ఎస్సై బాలాజీ చేరుకుని రాధిక, రితికల మృతదేహాలను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. వినీత్ అగర్వాల్, సుభాయ్ అగర్వాల్‌ను ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేశారు. ఎస్సై బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.