క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో తహశీల్దార్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఏప్రిల్ 14 : కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండల తహశీల్దార్‌గా పని చేస్తున్న ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం అనంతరంపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలు.. విష్ణువర్ధన్‌రెడ్డిది అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని గోవిందరావుపేట. ఈయన అనంతపురం జిల్లా సోమందేపల్లె తహశీల్దార్‌గా పనిచేస్తూ ఎన్నికల సమయంలో బదిలీపై బనగానపల్లెకు వచ్చారు. శనివారం ఉదయం నుంచి రాత్రి 1 గంట వరకూ కార్యాలయంలోనే పని చేశారు. ఆదివారం శ్రీరామనవమి పండుగ కావడంతో తానే డ్రైవ్ చేస్తూ కారులో స్వగ్రామం బయల్దేరాడు. ఈక్రమంలో అనంతపురం జిల్లా గార్లదినె్న మండలం తిమ్మంపల్లె సమీపంలో వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

చిత్రం... సంఘటనా స్థలంలో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం