క్రైమ్/లీగల్

స్నేహితులే కిరాతకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, ఏప్రిల్ 17: మద్యం మత్తులో ఓ యువకుడిపై స్నేహితులు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మంగళవారం రాత్రి షాద్‌నగర్ పట్టణ సమీపంలోని ఓ వెంచర్‌లో చోటు చేసుకుంది. షాద్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన నలుగురు యువకులు కలిసి సమీపంలో ఉన్న ఓ వెంటర్‌కు వెళ్లి అక్కడ అతిగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఏమి జరిగిందో తెలియదు కానీ నవీన్(22) అనే యువకుడిపై మిగతా ముగ్గురు యువకులు పెట్రోల్ పోసి నిప్పటించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వివరించారు. మద్యం సేవించిన తరువాత ఏమి జరిగింది.. గొడవ ఎందుకు వచ్చింది.. హత్యాయత్నానికి దారి తీసిన కారణాలు ఏమిటి.. అనే అంశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.