క్రైమ్/లీగల్
సదాశివకోనలో తమిళనాడు వాసి మృత్యువాత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కేవీబీపురం, మార్చి 26: మండలంలోని ఆరె పంచాయతీకి సంబంధించిన సదాశివకోనలో తమిళనాడు వాసి మృత్యువాత పడినట్లు కేవీబీపురం సబ్ ఇన్స్పెక్టర్ పరశురాముడు సోమవారం తెలిపారు. తమిళనాడులోని ఆవిడి డివిజన్కు సంబంధించిన శ్రీరామ్నగర్ వాస్తవ్యులు కె.గుణశేఖర్ (58) విహారయాత్రలో భాగంగా స్నేహితులు, బంధువులతో కలిసి కేవీబీపురం మండలంలో ప్రసిద్ధిగాంచిన సదాశివకోనకు వచ్చారు. బంధువులు, స్నేహితులు కోనలో వారి వారి స్నానాలు ఆచరిస్తుండగా కె.గుణశేఖర్ కోనలోని 2వ గుంటలో స్నానం చేస్తూ కళ్లుతిరిగి నీళ్లలో మునిగిపోయినట్లు స్నేహితులు, బంధువులు తెలిపారు. ప్రమాదాన్ని గుర్తించిన బంధువులు వెనువెంటనే గుణశేఖర్ను బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. ఏది ఏమైనప్పటికినీ సదాశివకోనలో రోజురోజుకూ మృత్యువాత ఎక్కువ అవుతున్నట్లు మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే మరింత మంది మృత్యువాత పడే అవకాశం ఉందని వారు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.