క్రైమ్/లీగల్

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, ఏప్రిల్ 18: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద బుధవారం రాత్రి ప్రత్యేక పోలీసు బృందం జరిపిన తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల రూపాయల విలువ చేసే 11 క్వింటాళ్ల గంజాయి పట్టుబడింది. తెలిసిన వివరాల ప్రకారం హైదరాబాద్ డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ అధికారులు పక్కా సమాచారం మేరకు కాపుకాసి గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్ర శోలాపూర్ సిలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు డీసీఎం వాహనంలో గంజాయిని తరలిస్తున్నారు. డీఆర్‌ఐ బృందం జరిపిన తనిఖీల్లో గంజాయి లోడు వేళ్తున్న డీసీఎం వాహనం పట్టుబడింది. అందులో ఉన్న 11.21 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకోని వాహనాన్ని సీజ్ చేసారు. అందుకు సంబంధించిన డీసీఎం డ్రైవర్‌తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నార్కొటిక్ డ్రగ్స్ యాక్టు కింద డీఆర్‌ఐ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.