క్రైమ్/లీగల్
ఆర్టీసీ బస్సును లారీ ఢీ: మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రేణిగుంట, మార్చి 26: మండల పరిధిలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా మారిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి స్థానిక రమణావిలాస్ కూడలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి ఆదివారం అర్ధరాత్రి ప్రయాణికులతో విజయవాడ వెళుతూ రేణిగుంట రమణావిలాస్ కూడలి వద్దకు రాగా, అదే సమయంలో బొప్పాయి లోడ్తో కడప నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ వేగంగా వచ్చి మలుపువద్ద ఆర్టీసీ బస్సు ఎడమవైపు మధ్యభాగంలో ఢీకొట్టింది. ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యంగా కుడివైపుకు ఉన్న డివైడర్ పైకి బస్సును పోనీయడంతో బస్సులోని ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అదేసమయంలో చిత్తూరు జిల్లాలో దేవాలయాల యాత్రకు వచ్చిన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్కు చెందిన బస్సు రమణావిలాస్ కూడలిలో ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద ఆపి సేద తీరుతున్నారు. ఆ సమయంలో లక్ష్మి, పద్మ అనే మహిళలు బహర్భూమికి వెళ్లి రోడ్డు దాటుతుండగా అదే సమయంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ అదుపుతప్పి మహిళలపైకి దూసుకురావడంతో లక్ష్మి, పద్మలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం రుయాకు తరలించగా, నిజామాబాద్ జిల్లా పురాన్పేట్కు చెందిన లక్ష్మి (40) చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. నిజామాబాద్కు చెందిన పద్మ (47) పరిస్థితి విషమంగా మారింది. రేణిగుంట పోలీసులు లారీ డ్రైవర్ రాజేంద్రకుమార్ను అరెస్ట్చేసి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.