క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచిలి, మార్చి 26: జాతీయరహదారిపై సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపినన వివరాలు ప్రకారం ఇచ్ఛాపురం మండలం, తెలుకుంచి నుంచి ద్విచక్రవాహనంపై నారాయణబట్టిలో తమ కుమారుడును తమ వెంట తీసుకువెళ్లేందుకు వెళ్తుండగా వెనుక నుంచి వస్తున్న చేపలవ్యాన్ చిన్న కొజ్జిరియా వద్ద బలంగా ఢీ కొనడంతో భార్య రేణుక(22) అక్కడికక్కడే మృతి చెందగా, దివాకర్(42) నేషనల్ హైవే అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కన్నబిడ్డను మరికొద్ది క్షణాల్లో చూస్తామనే ఆనందంతో వున్న ఆ దంపతులకు వ్యాన్ రూపంలో మృత్యువు కబళించింది. వారి మరణం నాలుగేళ్లు కుమారుడు అనాధ అయ్యాడని బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది. సంఘటన స్థలాన్ని పలాస డి ఎస్పీ రాఘవ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.