క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 23: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజాంపేట్ గ్రామం, రాజీవ్ గృహకల్పలో నివాసముండే నాగ ఆంజనేయులు కుమారుడు నాగ హేమంత్ (20) బౌరంపేట్‌లోని డీఆర్‌కే కాలేజీలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి హేమంత్ ద్విచక్ర వాహనం పై ప్రగతినగర్ వైపు వెళ్తున్నాడు. ఉల్లాస్ దాబా వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి హేమంత్ వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలై హేమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.