క్రైమ్/లీగల్

లారీని ఢీకొన్న కారు..ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోమందేపల్లి, మే 5 : అనంతపురం జిల్లాలో ఆదివారం ఓ కారు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమందేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఐదుగురు పశువుల వ్యాపారులు కారులో అనంతపురం నగరంలో జరిగే పశువుల సంతకు వచ్చారు. ఇక్కడ పని ముగించుకుని తిరిగి స్వస్థలం బయల్దేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు సోమందేపల్లి మండల పరిధిలోని పేటకుంట సమీపంలో 44 నెంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని అతివేగంగా వెళ్లి ఢీకొంది. ఈ సంఘటనలో కారు ముందుభాగం బాగా దెబ్బతినడంతో డ్రైవర్ అలీం(35), జబీవుల్లా(38) అక్కడికక్కడే మృతి చెందగా రహంతుల్లా, అబ్దుల్లా, మాజిత్ తీవ్రంగా గాయపడడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ప్రమాదంలో కళ్లెదుటే తన కుమారుడు జబీవుల్లా మృతి చెందడంతో రహంతుల్లా కన్నీరుమున్నీరుగా విలపించాడు.
చిత్రం...44వ నెంబర్ జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న కారు