క్రైమ్/లీగల్

బాలిక కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, మే 6: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న వ్యక్తి, అందుకు సహకరించిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం జడ్చర్ల మండలం గొల్లపల్లి ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్(25) వృత్తిరీత్యా అరబిందో ల్యాబ్‌లో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులైన శంకర్, పురుషోత్తం సహకారంతో వరసకు మరదలైన బాలికను కిడ్నాప్ చేసి శంషాబాద్‌లోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం యాదగిరి గుట్టకు వెళ్లారు. తిరిగి తన స్వగ్రామం గొల్లపల్లికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులు శ్రీకాంత్, శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. పురుషోత్తం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.