క్రైమ్/లీగల్

తహశీల్దార్ ముందు నేతల బైండోవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 7: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలువురి రాజకీయ నేతలను తహశీల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు మామిడిపల్లి వెంకట్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈద్గామపల్లి ఆశన్నగౌడ్, యాదయ్యను బైండోవర్ చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొకుండా ముందు జాగ్రత్తగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు తహశీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు షాద్‌నగర్ పట్టణ సీఐ శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం మే 8న సాయంత్రం ఐదు గంటలకు ముగిసిన వెంటనే 144సెక్షన్ అమల్లోకి వస్తుందని, పట్టణ సీఐ శ్రీ్ధర్‌కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.