క్రైమ్/లీగల్

ట్రాక్టర్ బోల్తా : వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మే 7: ట్రాక్టర్ బోల్తాకొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన భోగారం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శోభన్‌బాబు కథనం ప్రకారం బీహార్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ (32) డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం కీసరకు వచ్చి తిరిగి భోగారం గ్రామం వెళ్లేందుకు నీళ్ల ట్యాంకర్ ట్రాక్టర్ ఎక్కాడు. కీసర దాటగానే భోగారం సమీపానికి రాగానే నీళ్ల ట్యాంకర్ బోల్తా కొట్టింది. సత్యనారాయణ ట్యాంకర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శోభన్‌బాబు పేర్కొన్నారు.