క్రైమ్/లీగల్
భార్యను చంపిన భర్త అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 May 2019
పామర్రు, మే 9: పామర్రు మండలం నాగపట్నం వద్ద మూడు రోజులు కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జువ్వనపూడి ప్రశాంతి సంఘటనలో భర్త జువ్వనపూడి చంటిబాబు దోషిగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పామర్రు సీఐ శివశంకర్ గురువారం స్థానిక స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. దుర్వ్యసనాలకు భానిసైన చంటిబాబు తరచూ భార్యతో గొడవ పడుతూ గొంతు నులిమి చంపివేసి అనంతరం ఆమె ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించాడని సీఐ శివశంకర్ వివరించారు. భార్య ప్రశాంతిని హతమార్చిన భర్త చంటిబాబును అరెస్టు చేసి గుడివాడ కోర్టుకు పంపుతున్నట్లు ఎస్ఐ హబీబ్ భాషా వెల్లడించారు.