క్రైమ్/లీగల్

మైనింగ్ కొండల్లో జేసీబీ బోల్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దుర్తి, మార్చి 29 : మండల పరిధిలోని రామళ్లకోట గ్రామం సమీపంలో ఉన్న కొండల్లో మైనింగ్ పనులు చేస్తూ జేసీబీ బోల్తా పడిన సంఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాలు.. వెల్దుర్తి మండలంలోని బోయనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు హరి(19) జేసీబీ ఆపరేటర్. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు రాజు(18) హెల్పర్ పని చేస్తుండేవారు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి గురువారం రామళ్లకోట సమీపంలో ఉన్న కొండల్లో జేసీబీతో మైనింగ్ పనులు చేసేందుకు వెళ్లారు. అయితే కొండల్లో పనులు చేస్తుండగా సాయంత్రం 7 గంటల సమయంలో జేసీబీ బోల్తా పడింది. ఈ సంఘటనలో హరి, రాజు తీవ్రంగా గాయపడగా చుట్టుపక్కల వారు గమనించి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స చేస్తుండగా వారిద్దరూ మృతిచెందారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.