క్రైమ్/లీగల్

భారీగా గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 16: నగరానికి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధూల్‌పేట్‌కు చెందిన శుభం సింగ్(24), అదే ప్రాంతానికి చెందిన సతీష్ సింగ్(30), నార్కట్‌పల్లికి చెందిన గోలుసుల నరేష్(29), అదే ప్రాంతానికి చెందిన దుబ్బ నవీన్ కుమార్(19), ధూల్‌పేటకు చెందిన అనిల్ సింగ్(18), కార్వాన్‌కు చెందిన రోహిణిదేవి(19) ముఠాగా ఏర్పడి గంజాయిని సప్లయి చేస్తుంటారు. నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన గంజాయిని ప్యాకింగ్ చేసి స్థానికంగా ధూల్‌పేట్‌లో విక్రయిస్తుంటారు. కాగా బుధవారం సాయంత్రం వేళల్లో ఆరాంఘర్ చౌరస్తాలో అక్రమంగా 40 కేజీల బంగారం చేతులు మారుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 132 కేజీల గంజాయి, ఇండికా కారు, ద్విచక్ర వాహనం, రూ.185 240, ప్యాకింగ్ మెటిరియల్, వెయింగ్ మిషన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.