క్రైమ్/లీగల్
వాహనాల చోరీ కేసులో ఒకరి అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీడిమెట్ల, మే 16: వాహనాల చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రూ.8 లక్షలు విలువ చేసే వాహనాలను జీడిమెట్ల పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. గురువారం జీడిమెట్ల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ ఏసీపీ గోవర్దన్, సీఐ రమణా రెడ్డి వెల్లడించారు. మెదక్ జిల్లా చిలిప్చేడ్ మండలానికి చెందిన ఆర్.సుధాకర్.. షాపూర్నగర్ రాజీవ్ గాంధీ నగర్లో అద్దెకు నివసిస్తున్నాడు. జీడిమెట్ల పోలీసులు ఈ నెల 15న జీడిమెట్ల బస్ డిపో వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా సుధాకర్ అనుమానాస్పదంగా పట్టుపడ్డాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. రూ.8 లక్షలు విలువ చేసే 11 ద్విచక్ర వాహనాలు, ఓ ట్రాక్టర్, ఓ ట్రాలీని స్వాధీన పరుచుకున్నారు. దొంగసొత్తును తీసుకున్న ఆర్.సికిందర్ (22), ఎం.ప్రభు (20)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.