క్రైమ్/లీగల్

దోపిడీ కేసులో ఇద్దరికి జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 16: దోపిడీ కేసులో ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి రెండేళ్లు జైలు, రూ.500ల జరిమానా విధిస్తూ 11వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా మల్లమూరు గ్రామానికి చెందిన తాటపూడి సురేష్ అలియాస్ శివారెడ్డి, తాటపూడి తెల్లరాజు అనే సోదరులు గాయత్రినగర్‌లో నివాసముంటున్న కొడాలి విజయలక్ష్మీ అనే వృద్ధురాలు వద్ద కారుడ్రైవర్లుగా పని చేశారు. 2012 ఫిబ్రవరి 1న గుణదల ఈఎస్‌ఐ ఆస్పత్రి సమీపంలో కారులోని వృద్ధురాలిని కొట్టి ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకుని గన్నవరం పోలీస్టేషన్ పరిధిలోని వీఎన్‌పురం కాలనీ వద్దకు తీసుకెళ్లి వదిలేసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 11మంది సాక్షులను విచారించిన మీదట నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.