క్రైమ్/లీగల్

ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురం, మే 16: కన్నబిడ్డకు చిన్నగాయమైతేనే విలవిలలాడే తల్లి ఏకంగా ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి తాను అందులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చిత్తూరు జిల్లా విజయపురం మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. కేవలం తన అత్త, భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాలతో వివాహిత ఈ దారుణానికి ఒడిగట్టింది. శ్రీహరిపురానికి చెందిన విద్యుత్ లైన్‌మెన్ రమేష్‌తో పుత్తూరుకు చెందిన పూర్ణిమ (30)కు పదేళ్లక్రితం వివాహమైంది. కొంతకాలం వీరి సంసారం ఎంతో సజావుగా సాగింది. దీంతో వారికి జశ్వంత్ (8), అఖిల (6)లకు జన్మనిచ్చింది. కుటుంబ కలహాల నేపధ్యంలో గురువారం పూర్ణిమ తన ఇద్దరు పిల్లలను చీరతో కట్టివేసి బావిలో తోసివేసినట్టు పోలీసులు గుర్తించారు. పిల్లలు మృతిచెందారన్న విషయం ధృవీకరించుకుని చీరకొంగు చెట్టుకు కట్టుకుని ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. మేకలు మేపడానికి వెళ్లిన స్థానికులు ఈవిషయాన్ని గుర్తించి గ్రామస్థులకు పోలీసులకు సమాచారంఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి బావిలో పిల్లల మృతదేహాలను వెలికి తీశారు. 3 మృతదేహాలకు నగరి ఏరియా ఆసుపత్రిలో అధికారులు పంచనామా నిర్వహించారు. కాగా పోలీసులు భర్త రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.