క్రైమ్/లీగల్

అఫ్జల్‌గంజ్ లాడ్జిలో ఒడిశా మహిళ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: అఫ్జల్‌గంజ్ పోలీస్టేషన్ పరిధిలో ఓ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని పలు ప్రాంతాలు చూపిస్తానని చెప్పి ఆమె భర్త దారుణానికి ఒడిగట్టాడు. నమ్మి వెంట వచ్చిన అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పొలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన ప్రశాంత్ కుమార్ (32), మధు సుమిత(27) భార్యభర్తలు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రదేశాలు చూపిస్తానని చెప్పి, సుమితను హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో రూమ్ తీసుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమితను హత్య చేసిన ప్రశాంత్ అక్కడి నుంచి పరారయ్యాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయటంపై సుమిత బంధువులు పోలీస్టేషన్‌లో ఆందోళనకు దిగారు. కేసును నీరు గార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు.