క్రైమ్/లీగల్

రిమ్స్ మూడో అంతస్తు నుంచి దూకి రోగి ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మే 17: ఆదిలాబాద్ రిమ్స్‌లో వైద్య చికిత్స పొందుతున్న రోగి శుక్రవారం ఉదయం ఆసుపత్రి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన నారాయణ (34) అనే రోగి ఈనెల 15న వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రిమ్స్‌లో చేరాడు. రిమ్స్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో గల మెడికల్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. వైద్య చికిత్స వద్దని, ఇంటికి వెళ్దామని శుక్రవారం మొండికేయడంతో కుటుంబ సభ్యులు సముదాయించి అక్కడే ఉంచారు. వైద్యులు చికిత్స చేసేందుకు వార్డుకు వచ్చే సమయానికి ముందే శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో మూడో అంతస్తు నుండి కిందకు దూకగా రేడియాలజీ విభాగం ముందు పడి తలకు తీవ్రగాయాలతో రక్తస్రావం అయింది. ఇది గమనించిన స్థానికులు అతడిని ఎంఐసియూ వార్డుకు తరలించారు. ఇది తెలుసుకున్న రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ కళ్యాణ్ రెడ్డి వచ్చి వైద్యులను అప్రమత్తం చేసి అత్యవసర వైద్యసేవలు అందించినప్పటికీ రోగి సాయంత్రం 5 గంటలకు మృతి చెందాడు. కాగా మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
చిత్రం...మృతుడు నారాయణ