క్రైమ్/లీగల్

బాలికపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, మార్చి 29: మండల పరిధిలోని రాసూరుపల్లిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై బాధిత బాలిక గురువారం దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం కుక్కునూరు మండలం నల్లబాడుకు చెందిన బాలిక పది రోజుల క్రితం జరిగిన వినాయకపురంలో జరిగిన జాతరకు వచ్చి అక్కడి నుండి మండలంలోని రాసూరుపల్లిలోని తన స్నేహితురాలు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో గత గురువారం రాసూరు పల్లిలో వివాహ కార్యక్రమం జరిగింది. వివాహ వేడుకలో పాల్గొన్న సదరు బాలికను అదే గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు బలవంతంగా సమీప తోటల్లోకి తీసుకొని పోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో భయభ్రాంతులకు లోనైన ఆ బాలిక తన స్వంత గ్రామం వెళ్ళిపోయింది . అత్యాచారం జరిగిన విషయం తల్లితండ్రులకు తెలపడంతో వారు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన దమ్మపేట ఎస్సై ప్రవీణ్ కుమార్ రాసూరు పల్లి వెళ్లి విచారణ ప్రారంభించారు. అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా కేంద్రం కొత్తగూడెం తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణను వేగవంతం చేసారు.