క్రైమ్/లీగల్
రీ పోలింగ్పై హైకోర్టులో టీడీపీ పిటిషన్ : నేడు విచారణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 May 2019
అమరావతి, మే 17: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈనెల 19న 5 కేంద్రాల్లో రీ పోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశించటాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం రాత్రి హైకోర్టులో పిటిషన్ సమర్పించారు. దీనిపై శనివారం విచారణ జరగనుంది. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించాలని కూడా టీడీపీ భావిస్తోంది. ఒక విడత రీ పోలింగ్ నిర్వహించి ఎన్నికలు ముగిసిన 40 రోజులకు మరోవిడత రీపోలింగ్ జరపటం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ స్పందించకపోవటాన్ని తప్పుపడుతూ పిటిషన్ దాఖలైంది.