క్రైమ్/లీగల్

యూపీలో రోడ్డు ప్రమాదం ఏడుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియోరియా (ఉత్తర్ ప్రదేశ్), మే 17: ట్రక్కు, కారు ‘్ఢ’కొన్న ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. గురువారం రాత్రి కూకుందు పోలీసు స్టేషన్ పరిథిలోని బైరోన గ్రామ సమీపంలో అదుపు తప్పిన కారు వేగంగా దూసుకెళ్ళి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకున్నట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న బీహార్ రాష్ట్రంలోని సివన్ జిల్లాకు చెందిన అచె లాల్ (52), గోరఖ్‌పూర్‌కు చెందిన సంతోష్ సింగ్ (32), డియోరియాకు చెందిన రాకేష్ యాదవ్ (22), శశాంక్ మణి (30), చంద్రేష్ సింగ్ (60), అనిల్ శ్రీవాత్సవ (50), ఓం ప్రకాశ్ యాదవ్ (45) మృతి చెందినట్లు కుకూందు పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. భౌతికకాయాలను పోస్టుమార్టంకు పంపించినట్లు ఆయన చెప్పారు.