క్రైమ్/లీగల్
మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 18 May 2019
అన్నా (మధ్యప్రదేశ్), మే 18: ఇక్కడ జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కకర్హతి ప్రాంతానికి చెందిన మహేష్ గుప్తా కుటుంబ సభ్యులు శాంతా ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, ఒక పెద్ద గోతిలో పడిపోయింది. ఈ సంఘటనలో కారులో ఉన్న మున్నీ గుప్తా (50), అంజూ గుప్తా (40), జ్యోతి గుప్తా (35), బడ్డీ గుప్తా (35) అక్కడికక్కడే మరణించారు. పూజా గుప్తాను రేవాలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన మనోజ్ గుప్తాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.