క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, మే 18: రోడ్డు దాటి వెళ్తున్న వ్యక్తిని వేగంగా ఓ టిప్పర్ ఢీకొట్టిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సిక్కింకి చెందిన ఆర్ కే రాణా (55) నగరంలోని రామ్‌నగర్‌లో నివసిస్తూ క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి నగరశివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో ఓ వేడుకకు వెళ్లి తిరిగి వెళ్తున్నాడు. ఉప్పర్‌పల్లిలోని ప్రధాన రహదారిపై 177వ నెంబర్ పిల్లర్ వద్ద రోడ్డు దాటుతుండగా రాణాను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.