క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో అక్క, తమ్ముడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్,మే 19: బాపులపాడు మండలం శేరినరసన్న పాలెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డివైడర్ వద్ద మలుపు తిరుగుతున్న లారీని ద్విచక్రవాహనం వేగంగా ఢీకోనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వెళ్ళి ద్విచక్రవాహనంపై తిరిగివస్తున్న అక్క, తమ్ముడు అక్కడిక్కడే మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు తెలిపిన సమాచారం మేరకు పెదపాడు మండలం రాజుపేట గ్రామానికి చెందిన మెరుగుమాల లలిత కుమారి(45), మందపాటి వెంకటేశ్వరావు(55) గన్నవరం సమీపంలోని పెదఆవుటపల్లి గ్రామంలో జరిగిన బంధువుల అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండగా డెల్టా సుగర్స్ వద్దకు చేరుకున్న సమయంలో ముందుగా వెళ్ళుతున్న ట్పిపర్ డ్రైవర్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. అప్పటికే వేగంగావున్న వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనం నేరుగా టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో లలితకుమారి, వెంకటేశ్వరరావు టిప్పర్ వెనుక చక్రాల క్రిందపడడం టిప్పర్ వారిపై నుంచి వెళ్ళడం క్షణాల్లో జరిగిపోవడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. స్ధానికుల సమాచారం మేరకు వీరవల్లి పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. లారీడ్రైవర్ అకస్మత్తుగా యూటర్న్ చేయడం, ద్విచక్రవాహనం అధికవేగంలో వుండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్ పరారీలో వున్నాడని వీరవల్లి ఎస్‌ఐ చంటిబాబు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.