క్రైమ్/లీగల్
ఎస్యూవీ-ట్రక్ ఢీ ఆరుగురు దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాయ్పూర్, మే 20: చత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. పది మంది గాయపడ్డారు. 15 మందితో వెళ్తున్న ఎస్యూవీ ఓ ట్రక్ను ఢీకొంది. పెండారీ ఘాట్ వద్ద ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. బరాంపూర్ జిల్లాలోని ఓ ఆలయాన్న దర్శించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్ ఎస్యూవీని బలంగా ఢీకొంది. ట్రక్లో సాంకేతిక లోపం తలెత్తడంతో డ్రైవర్ వాహనాన్ని అదుపుచేయలేకపోయినట్టు ప్రాధమిక విచారణలో తేలింది. ఇరువాహనాల డ్రైవర్లు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ, ఓ బాలిక ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రితూ భూయ(450, ధ్యాన్రాం భూయ(50), రెష్మా(12), అందుల్నా(45), ఎస్యూపీ డ్రైవర్ పన్నాలాల్ కుష్వా(32), ట్రక్ డ్రైవర్ షాన్షా అహ్మద్(32) మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డవారిని మెరుగైన చికిత్సకోసం అంబికాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.