క్రైమ్/లీగల్

తాళం పగలగొట్టి నీటిని తీసుకువెళ్లిన దొంగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మే 20: గదికి వేసిన తాళం పగలగొట్టి తాగునీటిని తీసుకువెళ్లిన గుర్తు తెలియని దొంగలు. సోమవారం మధ్యాహ్నం కొత్తూరు బైపాస్ సమీపంలో ఉన్న నాట్కో పరిశ్రమ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. పరిశ్రమ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం నాట్కో పరిశ్రమ గేటు సమీపంలో ఉన్న పిల్టర్ వాటర్‌ను పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ప్రతిరోజు తీసుకువెళ్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన కార్మికులు డబ్బాలను పక్కనే ఉన్న గదిలో పిల్టర్ వాటర్ నింపి పెట్టి తాళం వేశారు. ఈ విషయాన్ని గమనించిన గుర్తు తెలియని దొంగలు తాళం ధ్వంసం చేసి డబ్బాల్లో నుండి నీటిని తీసుకువెళ్లారు.
పరిశ్రమ నుండి వచ్చిన కార్మికులు చూసే సరికి ఖాళీ డబ్బాలు మాత్రమే ఉన్నాయి. దీంతో సెక్యూరిటీని విచారించగా తనకు తెలియదని చేతులెత్తేశారు. మరోమారు ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని పరిశ్రమ యజమాన్యం సెక్యూరిటికి సూచించింది.