క్రైమ్/లీగల్

సైకో కిల్లర్‌పై మరో మూడు కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, మే 20: హాజీపూర్‌లో ముగ్గురు బాలికల హత్య కేసు నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు చేసేందుకు రాచకొండ పోలీసులు నల్లగొండ జిల్లా కోర్టులో సోమవారం పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా జడ్జి ఎస్. శశిధర్‌రెడ్డి ఈ కేసును ఈనెల 28కి వాయిదా వేశారు. పోలీసులు కోరిన పీటీ వారెంట్ కోర్టు అనుమతించిన పక్షంలో మరోసారి విచారణకు శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీకి కోరే అవకాశం ఉంది. కాగా ఇటీవల పోలీస్ కస్టడీలో శ్రీనివాస్‌రెడ్డిని విచారించగా మరో మూడు కేసుల్లో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారని, ఈ నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కాగా శ్రీనివాస్‌రెడ్డిపై కొత్తగా పోలీసులు పేర్కొంటున్న నేరాలు ఏమై ఉండవచ్చన్నవి చర్చనీయాంశమైంది. కొత్తగా పోలీసులు పేర్కొంటున్న కేసులు సైతం అత్యాచారం, హత్య కేసులేనా లేక ఇంకేమైనా కేసులా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.