క్రైమ్/లీగల్

వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మే 21: వ్యక్తి దారుణంగా హత్యకు గురైన సంఘటన తంగిళ్ళపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కొందుర్గు మండల పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామానికి చెందిన వడ్ల మాధవచారి (55) అనే వ్యక్తిని సోమవారం రాత్రి అతని పొలం వద్ద గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు వివరించారు. ఉదయం వేళలో ఆచారి మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలతో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటనా స్థలాన్ని షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, రూరల్ సీఐ రామకృష్ణ పరిశీలించారు. మృతుని కొడుకు ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
ట్యాంకర్ బోల్తా..వ్యక్తికి తీవ్ర గాయాలు
కొత్తూరు రూరల్, మే 21: ట్యాంకర్ బోల్తా పడిన సంఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం నందిగామ మండలం మేకగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కోల్‌బావితండా సమీపంలో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ధన్‌సింగ్‌నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా మెరుగైన వైద్యం కోసం శంషాబాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.