క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, మార్చి 30: పెళ్లి చేసుకుని నిండునూరేళ్లు జీవించాలనుకున్న ప్రేమజంట.. పెద్దలకు తమ ప్రేమను చెప్పలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన కొడంగల్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవికుమార్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మండ ల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన రాజు (19) ఇందనూర్ గ్రామానికి చెందిన రోజా (18) కలిసి రావులపల్లిలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. రోజా చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. పాఠశాల సమయంలో ఇరువురు స్నేహంగా ఉండేవారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయారు. వీరి ప్రేమ విషయం ఇరు కు టుంబ సభ్యులకు తెలియడంతో పలుమార్లు మందలించారు. ఇటీవల అమ్మాయికి దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడికి ఇచ్చి వివాహం జరిపించేందుకు నిశ్చయంచారు. ఈ నేపథ్యంలో ప్రేమించినవాడు ఎక్కడ కాకుండా పోతాడోనని గురువారం రాత్రి ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయి ఇందనూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు.
రాజు తన స్నేహితుడికి సమాచారం అందిస్తూ తాము పురుగుల మందు సేవిస్తూ చనిపోతున్నామని చెప్పాడు.
విషయం కుటుంబసభ్యులకు తెలియ డంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రతప్ చౌహన్ ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తాండూర్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాద్‌లోని గాంధీకి రిఫర్ చేశారు. యువతి తండ్రి నర్సిములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.