క్రైమ్/లీగల్
తమ్ముడిని హత్య చేసిన అన్న
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీడిమెట్ల, జూన్ 10: డబ్బుల విషయంలో సొంత తమ్ముడ్నే అన్న హత్య చేసిన సంఘటన దుందిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, గుమ్మడిదల మండలం, అన్నారం గ్రామంలో నివాసముండే జానకి రామ్, చిలక అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు సంతానం. పెద్ద కొడుకు వినయ్ కుమార్ (23), చిన్న కొడుకు కార్తీక్ కుమార్ (19) మెకానిక్ పని చేస్తారు. ఇద్దరు కలిసి దుందిగల్ రింగ్ రోడ్డుకు వచ్చారు. డబ్బుల విషయంలో వినయ్, కార్తిక్ మధ్య వివాదం నెలకొంది. గండిమైసమ్మలోని మండి బిర్యానీ తినడానికని పిలిపించిన వినయ్ దుందిగల్ ఓఆర్ఆర్ వద్ద ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. కారులో నుంచి ఇనుప రాడ్ని తీసిన వినయ్.. కార్తీక్ను కొట్టాడు. గాయాలకు గురైన కార్తిక్ అక్కడే పడిపోయాడు. వినయ్ అన్నారంలోని ఇంటికి వెళ్లి తల్లి అరుణకు రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పి దుందిగల్ ఓఆర్ఆర్ వద్దకు అదే కారులో తీసుకువచ్చారు. చికిత్స నిమిత్తం కార్తీక్ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.