క్రైమ్/లీగల్

ఎయిర్‌పోర్టులో విదేశీ కరెన్సీ పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 10: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున కోటీ మూడు లక్షల విదేశీ కరెన్సీ నోట్లను సీఐఎస్‌ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చంద్రాయన్‌గుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దుబాయికి వెళ్తున్నట్లు తెలిపారు. ఈ వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఇతని వద్ద విదేశీ కరెన్సీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులు నోట్లతో పాటు అతన్ని అదుపులోకి తీసుకున్ని విచారిస్తున్నట్లు తెలిపారు.