క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, జూన్ 10: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రాంచంద్రాపూర్ గేట్ వద్ద చోటు చేసుకుంది. కొందుర్గు ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి కొందుర్గు మండల కేంద్రం నుంచి ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్‌కు వెళ్తున్న నర్సింలు (35) అనే వ్యక్తి రాంచంద్రాపూర్ గేటు వద్ద అడవి పందులు అడ్డం రావడంతో అదుపు తప్పి బైక్ బొల్తా పండటంతో, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైకు అదుపు తప్పి వ్యక్తికి గాయాలు
షాద్‌నగర్ టౌన్, జూన్ 10: బైకు అదుపు తప్పడంతో వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం కొందుర్గు మండలం రాంచంద్రాపూర్ గ్రామ సమీపం, పరిగి రోడ్డులో కుల్కచర్ల మండలం బండిఎల్కిచర్ల గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్ వస్తుండగా, బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.