క్రైమ్/లీగల్

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుర్గి, జూన్ 11: అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గుంటూరు జిల్లా మండల కేంద్రమైన దుర్గిలో మంగళవారం జరిగింది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బలుసు అప్పారావు(45), అతని భార్య సుధావాణి (39) మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో వారి గృహంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతునికి 14 ఎకరాల పొలం ఉంది. దీంతోపాటు అపరాల వ్యాపారం కూడా చేసేవాడు. గత 4 సంవత్సరాల నుండి వర్షాలు లేక పంటలు పండకపోవటంతో పాటు, అటు వ్యాపారంలోనూ నష్టాలు వచ్చాయి. దీంతో అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ అప్పులు 40 లక్షల రూపాయల వరకు పెరిగిపోయాయి. అతడికి రావాల్సిన డబ్బులు రాకపోవడంతో పాటు, అప్పులిచ్చిన వారు గత 3 నెలల నుండి ఒత్తిడి ఎక్కువ చేశారు. రోజూ ఇంటికి వచ్చి అప్పులు తీర్చమని అడుగుతుండటంతో మనోవేదనకు గురైన అప్పారావు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శివనాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులకు హేమంత్, హర్షిత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిత్రం... పురుగుల మందు తాగి మృతి చెందిన దంపతులు