క్రైమ్/లీగల్
పౌర రిజిస్టర్లో పేరు నమోదుకు లంచం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గౌహతి, జూన్ 13: జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ)లో పేరు నమోదు చేసేందుకు ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఇద్దరు అధికారులు గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇక్కడి దిస్పూర్లోని జాతీయ పౌర రిజిస్టర్ సేవా కేంద్రంలో పనిచేసే ఫీల్డ్ లెవల్ అధికారి సయ్యద్ సహజాన్ ఒక మహిళ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ మహిళ పేరు ఖజాతీ ఘోష్ దత్తా అని, గౌహ తి నగర పరిధిలోని ఆనంద్ నగర్ వాసి అని పోలీసులు తెలిపారు. అలాగే అతనికి సహకరించిన అదే సేవా కేంద్రంలో పనిచేసే స్థానిక అసిస్టెంట్ రిజిస్ట్రార్ (ఎల్ఆర్సీఆర్) రాహుల్ పరాశర్ను సైతం అవినీతి కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ఆర్సీలో పేరు నమోదుకు చేసుకున్న దత్తా దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని, లంచం ఇస్తే వాటిని సరిచేస్తామని ఇద్దరు అధికారులు డిమాండ్ చేశారని, దీంతో ఆ మహిళ అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారని పోలీసులు చెప్పారు. అరెస్టు చేసిన ఇద్దరు అధికారులను శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెడతామని తెలిపారు.