క్రైమ్/లీగల్

కొడుక్కు ఉరేసి.. తల్లి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొర్రూరు, జూన్ 13: కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంతో జీవితంపై విరక్తిచెంది తన 13నెలల కుమారునికి ఉరేసి ఆపై తాను కూడా ఉరేసుకొని ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో చొటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుర్తురు గ్రామానికి చెందిన చెట్టబోయిన అశోక్ అనే యువకుని భార్య సంధ్య (26), 13 నెలల కుమారుడు చెట్టబోయిన రిత్విక్ గురువారం ఉదయం వారి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గత కొద్దినెలలుగా తన అత్తతో వేరు పడి హైద్రాబాద్‌కు వెళ్లి జీవించాలని సంధ్య తన భర్తతో తరచూ వాదించేదని ఈ క్రమంలో గత కొద్దినెలలుగా ఇంట్లో కుటుంబ కలహాలు ఎక్కువ అయ్యాయని గ్రామస్థులు తెలిపారు. ఈ నేపథ్యంలో వేరుకాపురం పెట్టేందుకు తన భర్త అంగీకరించకపోవడంతో క్షణికావేశంతో గురువారం ఉదయం మొదట తన కుమారుడు రిత్విక్‌కు తాడుతో ఇంట్లోని దూలానికి ఉరివేసి అతడు చనిపోయాడని నిర్దారించుకున్న తర్వాత సంధ్య కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాలే సంధ్య, ఆమె కుమారుడు రిత్విక్ ఆత్మహత్యకు కారణమని గ్రామస్థుల, పోలీసులు భావిస్తున్నారు. తొర్రూరు సీఐ వి.చేరాలు, ఎస్సై సీహెచ్ నగేష్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.